క్షమయా ధరిత్రి అన్నారు..కదా ..
పుచ్చుకున్నమ్మ వాయనం అన్నట్టు, అన్నీ తీసుకోవడమే కాని ఇవ్వడమే తెలీదు ,ఈ బుద్ధి హీన మానవుడు, ఇంక నాలుగు రోజుల్లో, ధరిత్రి దినం అంటూ, ఊదర కొడతారు, టీవీ లలో, మాట్లాడు తారు, పుస్త కాల్లో రాస్తారు, ఇన్ని చెట్లు కొట్టేస్తున్నారు, అడవు లని నేల మట్టం చేస్తున్నారు కఠిన వ్యర్ధ పదార్ధాలు వదిలేసి నదులలోకి నీటిని కలుషితం చేస్తున్నారు, ఒక విత్తు నాటితే , ఒక్క చెట్టే కాదు, వంద పండ్లను ఇస్తాను, అయినా ఏవో, రసాయనాలు నా నోట్లో పోస్తారు, అని విలపిస్తున్న భూదేవి, కోపం తో ఒక్క సారి, పొగలు, సెగలు చిమ్మి, తన ప్రతాపం చూపించింది.
ఐస్లాండ్ లో నివురు గప్పిన వోల్కానో , ధరిత్రి దినం అంటూ మీరు చెప్పే మాటలు ఇంక చాలు అంటూ నోరు తెరిచి చెప్పినట్టు అన్పించింది నాకు అయితే. అభివృది చెందాం మేము అని గొప్పలు చెప్పుకునే దేశాలు యావత్తు, కాళ్ళు కట్టేసి నట్టు చతికిల పడ్డాయి. విమనాశ్రాయాలే నివాసాలు. సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ గారు, తలుచు కుంటే, ప్రయాణం ఆగిపోయింది. కోట్లు కోట్లు డాలర్లు నష్టం అంటున్నారు. వారం పాటు ఆకాశ ప్రయాణాలు రద్దు.
క్షమయా ధరిత్రి అంటూ ,ఎవరు మనసు లో తలుచుకుని వేడుకున్నారో, అల్ప మానవులు అని దయ తలిచి శాంతించింది.. అమ్మ.
ఇప్పటి కైనా ఒక చెట్టు కొట్టితే మరో చెట్టు పెంచడం, నీరు ని పదిలం గా వాడు కోవడం, నదు లని పూజించడం అంటే, బొట్టు పెట్టి కాదు, హారతి ఇచ్చి కాదు, బొట్టు బొట్టు, విలువైన ప్రాణ జలం అని నమ్మి, ముందు తరాలకు కూడా కొంచం నీరు మిగుల్చుదాం అని ఒట్టు పెట్టుకుని, స్వచ్చని జలం నదిలో పారడమే, మనం ఇచ్చే హారతి అని గట్టిగా పాటించి, చెవిటి ప్రభుత్వాలు మేలుకోవడానికి, చెవి లో శంఖం ఊది, కళ్ళు మూసు కున్న జనాలకు మన ఆచరణలతో కళ్ళు తెరిపించి, వాడ వాడ లా ప్రకృతి ని గవురవించే వారసత్వం ను ముందు తరాలకు అందించే బృహత్ కార్యాలకు, నడుం చుట్టి, ఈ భూమి కి అతిధి గా వచ్చాం, మర్యాదగా మసలుకుందాం మర్యాద తెలిసిన నాగరికులం కదా.
ఇంక ఈ భూమి ని ఒక పట్టు పట్టాం, ఇప్పుడు చంద్రుడు, గ్రహాలూ అంటూ ఎగురుతున్నాం. చల్లని జాబిలి మామ , చందమామ, తల ఎత్తి చూస్తే , నిండు గా నవ్వుతూ, వెండి వెన్నెల ని దయ గా కురిపిస్తాడు. కుందేలు బొమ్మే కని పిస్తుంది నాకు, ఇప్పటికీ, చంద్రుడి మధ్యలో, ఆకాశ హర్మ్యాలు పొగలు చిమ్మే మన వాహనాలు ఊహించుకుంటే, ఆ చంద్రుడి మీద జాలి కలగదూ. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తయారు అయారుట చంద్రుడి మీద ప్లాట్లు అమ్మడానికి.
ఒక భూమి చాలలేదు మన ఆశల వెర్రి కి, ఇంకో గ్రహం కూడా ఎగర డానికి సిద్ధం అవుతున్నాం. చూద్దాం చూద్దాం, ఈ మానవుల ఆశ కు హద్దు ఎక్కడో? అని భూదేవి ఓపిక పట్టింది. మన గొయ్యి ని మనమే తవ్వుకున్నట్టు , మన నాశనం కి మనమే బాటలు వేసుకుంటున్నాం. భూమి, నీరు, గాలి అన్నిటి తో వ్యాపారమే, ముందు వెనక ఆలోచన లేదు,గల గలమని కాసులు కురిపిస్తే చాలు, దేనిని అమ్మడానికినా మనం సిద్ధమే ..మానవులు, నీచ మానవులు అని ఈ తల్లి మనలని శపించక ముందే, మేలుకోవాలి మనం. క్షణం క్షణం విలువైనది, రేపు నీ పిల్లలకి ఎన్ని మూటలు మిగిల్చావని చూడరు, మనకి ఎంత నీరు, గాలి, భూమి మిగిల్చారు ,మా అమ్మ నాన్నలు అని చూస్తారు.
నెవిల్ షుటే బీచ్ నవల లో ఒక దేశం లో అందరు అణు ప్రయోగం వల్ల చనిపోవడానికి సిద్ధం అవుతూ, చెట్లు నాటు తారు. తమ తరువాత వచ్చే తరంకు ఏదో మిగాల్చాలి అని ఆశ, మనం కూడా ఇదే ఆఖరి రోజేమో ఈ భూమి మీద మనకి నూకలు చెల్లిపోయాయి అను కుని వందనం గా , భూదేవి ముందు వినమ్రం గా మెలగాలి, మన అడుగు జాడలు కూడా మిగలవు, కాని మనం నాటే ఒక మొక్క, మిగుల్తుంది, రెప రెప లాడుతూ, భూమి కి మొక్కుతుంది.
ఈ రోజు, ఈ దినం, అని లెక్కలు మరిచి కోట్ల సంవత్సరాలు గా మనలని మోస్తున్న ఈ ధరిత్రి కి తల వంచి ఒక వినమ్ర దణ్ణం...అంతేనా??
పుచ్చుకున్నమ్మ వాయనం అన్నట్టు, అన్నీ తీసుకోవడమే కాని ఇవ్వడమే తెలీదు ,ఈ బుద్ధి హీన మానవుడు, ఇంక నాలుగు రోజుల్లో, ధరిత్రి దినం అంటూ, ఊదర కొడతారు, టీవీ లలో, మాట్లాడు తారు, పుస్త కాల్లో రాస్తారు, ఇన్ని చెట్లు కొట్టేస్తున్నారు, అడవు లని నేల మట్టం చేస్తున్నారు కఠిన వ్యర్ధ పదార్ధాలు వదిలేసి నదులలోకి నీటిని కలుషితం చేస్తున్నారు, ఒక విత్తు నాటితే , ఒక్క చెట్టే కాదు, వంద పండ్లను ఇస్తాను, అయినా ఏవో, రసాయనాలు నా నోట్లో పోస్తారు, అని విలపిస్తున్న భూదేవి, కోపం తో ఒక్క సారి, పొగలు, సెగలు చిమ్మి, తన ప్రతాపం చూపించింది.
ఐస్లాండ్ లో నివురు గప్పిన వోల్కానో , ధరిత్రి దినం అంటూ మీరు చెప్పే మాటలు ఇంక చాలు అంటూ నోరు తెరిచి చెప్పినట్టు అన్పించింది నాకు అయితే. అభివృది చెందాం మేము అని గొప్పలు చెప్పుకునే దేశాలు యావత్తు, కాళ్ళు కట్టేసి నట్టు చతికిల పడ్డాయి. విమనాశ్రాయాలే నివాసాలు. సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ గారు, తలుచు కుంటే, ప్రయాణం ఆగిపోయింది. కోట్లు కోట్లు డాలర్లు నష్టం అంటున్నారు. వారం పాటు ఆకాశ ప్రయాణాలు రద్దు.
క్షమయా ధరిత్రి అంటూ ,ఎవరు మనసు లో తలుచుకుని వేడుకున్నారో, అల్ప మానవులు అని దయ తలిచి శాంతించింది.. అమ్మ.
ఇప్పటి కైనా ఒక చెట్టు కొట్టితే మరో చెట్టు పెంచడం, నీరు ని పదిలం గా వాడు కోవడం, నదు లని పూజించడం అంటే, బొట్టు పెట్టి కాదు, హారతి ఇచ్చి కాదు, బొట్టు బొట్టు, విలువైన ప్రాణ జలం అని నమ్మి, ముందు తరాలకు కూడా కొంచం నీరు మిగుల్చుదాం అని ఒట్టు పెట్టుకుని, స్వచ్చని జలం నదిలో పారడమే, మనం ఇచ్చే హారతి అని గట్టిగా పాటించి, చెవిటి ప్రభుత్వాలు మేలుకోవడానికి, చెవి లో శంఖం ఊది, కళ్ళు మూసు కున్న జనాలకు మన ఆచరణలతో కళ్ళు తెరిపించి, వాడ వాడ లా ప్రకృతి ని గవురవించే వారసత్వం ను ముందు తరాలకు అందించే బృహత్ కార్యాలకు, నడుం చుట్టి, ఈ భూమి కి అతిధి గా వచ్చాం, మర్యాదగా మసలుకుందాం మర్యాద తెలిసిన నాగరికులం కదా.
ఇంక ఈ భూమి ని ఒక పట్టు పట్టాం, ఇప్పుడు చంద్రుడు, గ్రహాలూ అంటూ ఎగురుతున్నాం. చల్లని జాబిలి మామ , చందమామ, తల ఎత్తి చూస్తే , నిండు గా నవ్వుతూ, వెండి వెన్నెల ని దయ గా కురిపిస్తాడు. కుందేలు బొమ్మే కని పిస్తుంది నాకు, ఇప్పటికీ, చంద్రుడి మధ్యలో, ఆకాశ హర్మ్యాలు పొగలు చిమ్మే మన వాహనాలు ఊహించుకుంటే, ఆ చంద్రుడి మీద జాలి కలగదూ. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తయారు అయారుట చంద్రుడి మీద ప్లాట్లు అమ్మడానికి.
ఒక భూమి చాలలేదు మన ఆశల వెర్రి కి, ఇంకో గ్రహం కూడా ఎగర డానికి సిద్ధం అవుతున్నాం. చూద్దాం చూద్దాం, ఈ మానవుల ఆశ కు హద్దు ఎక్కడో? అని భూదేవి ఓపిక పట్టింది. మన గొయ్యి ని మనమే తవ్వుకున్నట్టు , మన నాశనం కి మనమే బాటలు వేసుకుంటున్నాం. భూమి, నీరు, గాలి అన్నిటి తో వ్యాపారమే, ముందు వెనక ఆలోచన లేదు,గల గలమని కాసులు కురిపిస్తే చాలు, దేనిని అమ్మడానికినా మనం సిద్ధమే ..మానవులు, నీచ మానవులు అని ఈ తల్లి మనలని శపించక ముందే, మేలుకోవాలి మనం. క్షణం క్షణం విలువైనది, రేపు నీ పిల్లలకి ఎన్ని మూటలు మిగిల్చావని చూడరు, మనకి ఎంత నీరు, గాలి, భూమి మిగిల్చారు ,మా అమ్మ నాన్నలు అని చూస్తారు.
నెవిల్ షుటే బీచ్ నవల లో ఒక దేశం లో అందరు అణు ప్రయోగం వల్ల చనిపోవడానికి సిద్ధం అవుతూ, చెట్లు నాటు తారు. తమ తరువాత వచ్చే తరంకు ఏదో మిగాల్చాలి అని ఆశ, మనం కూడా ఇదే ఆఖరి రోజేమో ఈ భూమి మీద మనకి నూకలు చెల్లిపోయాయి అను కుని వందనం గా , భూదేవి ముందు వినమ్రం గా మెలగాలి, మన అడుగు జాడలు కూడా మిగలవు, కాని మనం నాటే ఒక మొక్క, మిగుల్తుంది, రెప రెప లాడుతూ, భూమి కి మొక్కుతుంది.
ఈ రోజు, ఈ దినం, అని లెక్కలు మరిచి కోట్ల సంవత్సరాలు గా మనలని మోస్తున్న ఈ ధరిత్రి కి తల వంచి ఒక వినమ్ర దణ్ణం...అంతేనా??