ఏలూరు విజ విహార్ సెంటెర్ తెలియని వారెవరు ? ఇప్పుడుందో ,లేదో ,మరి .విజా విహార్ లో మినపట్టు మా
ఇంట్లో అందరికీ ..భలే ఇష్టం..చుట్టాలు వస్తే , ఇంటిల్లిపాదికీ ఒక రోజు ,విజా విహార్ లో మినపట్టు తినిపించడం
మా ఇంటి ఆనవాయితీ అయిపోయింది ..
ఒక పక్క అశొక్ నగర్ రోడ్డు ,మరో ప్రక్కా ఇంకం టాక్స్ ఆఫీసు రోడ్డు , తిన్నగా రా రా పేట ( రామచంద్ర
రావు పేట ) కి దారి తీస్తున్న జంక్షం లో మరో నాలుగో వైపు దారి తీస్తే ,ఒక దరి ప్రభుత్వ ఆసుపత్రి , మరీ అంత
గొప్ప ,ఘన చరిత్ర లేదు లెండి ..
ఆ ఆసుపత్రి ఎదురుగా మా స్కూలు ..సైట్ థిరెసా హై స్కూలు ...ఆడపిల్లల బడి ..
ఆరో తరగతి మొదలు ..డిగ్రీ వరకూ అక్కడే ..అంటే షుమారు పదేళ్ళు నా జీవితం లో గడిచిన ప్రదేశం అది
..చదువు ,బుద్దులు , స్నేహాలు , ఆరాధనలు , ఆరాటాలు ,నేర్పించిన బడి అది ..
సిమెంటు రంగు భవనాలు , మూడు వైపులా ,మూడు అంతస్తుల భవనాలు , పెద్ద గోడ , బడి ఆవరణ చుట్టూ ,
విశలమైన మైదానం ,దారి కిరు వైపులా గానుగ చెట్లు ,ఆ పూలు నేల మీద రాలితే ,అవి నేల కనిపించనత దట్టం
గా పూల తివాసీ పరిచేవి ..
ఆ పూలు ని చేతులతో మలుస్తూ ..బడి మధ్య లో ఇచ్చే ఇంటెర్వల్ లో ..పేర్లు రాసుకోవడం ఒక జ్నాపకం ..
ఇంకా నాలుగు గడులు మట్టి లో గీసుకుని ఉప్పు ఆట ఆడ్డం మరో బాల్య స్మృతి ..
అందరి కన్నా ముందు గేట్లు తెరిచే సమయానికి ఉండి, గేట్లు తెరిపించి , నల్ల బోర్డు మీద ' థాట్ ఫర్ టుడే 'అని
ఒక మంచి మాట ఏదైనా వ్రాయడం నాదే బాధ్యత ..ముందు అందుకే వెళ్ళడం ..ఇండియం ఎక్ష్ప్రెస్స్ వార్తా పతిక (
దిన ) నుండి కాపి ..ఇప్పట్లొ దీనినే కాపి అండ్ పేస్ట్ అంటారు కదా ..
విమలా టీచర్ ..అనే తిట్లు పాటల్లా గా ..
దయ్యాలు ,పిశచాలు ..అంటూ శుభ్రమైన ఆంగ్ల భాష లో తిట్లు ..
ఫిష్ మార్కెట్ ..సరే సరి ...అది మామూలు పర్యాయ పదం మాకోసం ..
నిర్మలా టీచర్ ..ఇంగ్లిష్ టీచర్ ..' వెం ఐ వస్ డూయింగ్ మై బీ ఎడ్ ' తో మొదలు అయేవి ..ఆమె పా్ఠాలు ..
ఆవిడ అంటే నాకు ఆరాధన ..అప్పట్లో ..వీలు అయినప్పుడు అలా ..ఒక గులాబి పువ్వు ఇచ్చేదాన్ని ..
లీనా టీచర్ సైంస్ కి , గిరి వర రాజ కుమారి మాథ్స్ కి ..
అందరూ లీలగా కాదు ,కాదు ..బాగా గుర్తు ఉన్నారు ..
చాలా ఆప్యాయం గా , చూసుకుని ,చక్కని చదువు సంధ్యలు నేర్పించారు మాకు ..
నాగ మణి టీచర్, తెలుగు టీచర్ .. రాధామణి అన్నా నాకు ప్రత్యేక అభిమానం ..
ఆవిడే నన్ను ఈ బడిలొ వేసారు ..ఆరో తరగతి లో ..
కాంసెర్ అనే వ్యాధి అని తెలిసి , ఏది రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది అనే బాధ తో ..గుండె ఆగి
పోయారు అని తెలిసిన రోజు ..ఎంత బాధ కలిగిందో ..
రాగయుక్తం గా పద్యం చదివి , ప్రతి పదార్ధం చెపితే ఆమె ..పది కి పది మర్కులు పడిపోతాయని ఇంక గారంటీ ..
అంత గొప్ప టీచర్ ఆవిడ ..
సంగీతం మాస్టరు ,డాంసు మాస్టారు ..కోరాడ గారు .. అందరూ ..మాకు సంగీత నృత్యాలు చెప్పడానికి
ప్రయత్నించేరు ...పార్వతి టీచర్ ..ఆవిడ మంచి నాట్యం నేర్పించేవారు ..
స్కూల్ ఫీస్ సమ్వ్త్సరానికి ..ముప్పై నలభై రూపాయలు ..అంతే ..
ఎనిమిదొ తరగతి లో మద్రాసు ,తిరుపతి , కి విజ్నాన యాత్ర కి తీసుకు వెళ్ళేరు .. ఒక ప్రైవేట్ బస్ ..రావల్సిన
సమయం కంటే ...ఆలెసం గా రావడం ...తర్వాత ..మా పిల్లలల కల కలం ..హడావిడి . ఆ సరదా యత్ర అంతా
ఇంకా గుర్తే నాకు ..
బడి అంటే ఉత్సాహం ...టీచర్లు అంటే భయ భక్తులు , ప్రేమ ,ఆరాధన ..
స్నేహితురాళ్ల తో మైత్రి , కబుర్ల కోలాహలం ..
అన్నీ వేడుక లా తోస్తున్నాయి ఇప్పుడు ..
మేము చదివన ఈ బడి ..ప్లాటినం జుబిలీ ..అంటే 75 ఏళ్ళ పండగ చేసుకుంటొం దిట ..వచ్చే నెల 7 న ..
నేను అక్కడ ఉంటే తప్పకుండా వెళ్ళి ఉండే దాన్ని ..
ఎందుకో మరి , ఇన్ని సార్లు ఏలూరు వెళ్ళినా ఎప్పుడూ మా స్కూల్ కి వెళ్ళ లేదు ..
అంతటి అనుబంధం ఉన్నా ..ఎందుకని మేము వెళ్ళ లేదు అని ఇప్పుడు అనిపిస్తోంది ..
అందరూ మారి పోయారు , మనలని గుర్తు పట్టే వారు లేరని ?? ఒక భావంం ఏమో ?
మా అత్తగారు కూడా ఇదే బడి లో మాథ్స్ టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు ..
మా ఆడపడుచు నేను ..ఇదే బడి , ఇక్కడే మా స్నేహం కి ఆరంభం ..
చదువు ,సంస్కారం . విద్య బుద్దులు నేర్పిన మా బడి కి ..
అభినందనలు ..శుభాభినందనలు ..
పిల్లలు మారి పోతారు , టీచర్లు విశ్రిిస్తూ ఉంటారు ..
కానీ ..చదువు ని నేర్పే ఆ బడి ఆవరణ లో విద్యా కుసుమాలు మటుకు ఇంకా అలా వికసిస్తూనే ఉంటాయి ..
ఆ విద్య వనంం లో మరిని సుమాలు ,నిరంతరం ..తరంం తరం వికసించాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ...వసంత లక్ష్మి .పి.
ఇంట్లో అందరికీ ..భలే ఇష్టం..చుట్టాలు వస్తే , ఇంటిల్లిపాదికీ ఒక రోజు ,విజా విహార్ లో మినపట్టు తినిపించడం
మా ఇంటి ఆనవాయితీ అయిపోయింది ..
ఒక పక్క అశొక్ నగర్ రోడ్డు ,మరో ప్రక్కా ఇంకం టాక్స్ ఆఫీసు రోడ్డు , తిన్నగా రా రా పేట ( రామచంద్ర
రావు పేట ) కి దారి తీస్తున్న జంక్షం లో మరో నాలుగో వైపు దారి తీస్తే ,ఒక దరి ప్రభుత్వ ఆసుపత్రి , మరీ అంత
గొప్ప ,ఘన చరిత్ర లేదు లెండి ..
ఆ ఆసుపత్రి ఎదురుగా మా స్కూలు ..సైట్ థిరెసా హై స్కూలు ...ఆడపిల్లల బడి ..
ఆరో తరగతి మొదలు ..డిగ్రీ వరకూ అక్కడే ..అంటే షుమారు పదేళ్ళు నా జీవితం లో గడిచిన ప్రదేశం అది
..చదువు ,బుద్దులు , స్నేహాలు , ఆరాధనలు , ఆరాటాలు ,నేర్పించిన బడి అది ..
సిమెంటు రంగు భవనాలు , మూడు వైపులా ,మూడు అంతస్తుల భవనాలు , పెద్ద గోడ , బడి ఆవరణ చుట్టూ ,
విశలమైన మైదానం ,దారి కిరు వైపులా గానుగ చెట్లు ,ఆ పూలు నేల మీద రాలితే ,అవి నేల కనిపించనత దట్టం
గా పూల తివాసీ పరిచేవి ..
ఆ పూలు ని చేతులతో మలుస్తూ ..బడి మధ్య లో ఇచ్చే ఇంటెర్వల్ లో ..పేర్లు రాసుకోవడం ఒక జ్నాపకం ..
ఇంకా నాలుగు గడులు మట్టి లో గీసుకుని ఉప్పు ఆట ఆడ్డం మరో బాల్య స్మృతి ..
అందరి కన్నా ముందు గేట్లు తెరిచే సమయానికి ఉండి, గేట్లు తెరిపించి , నల్ల బోర్డు మీద ' థాట్ ఫర్ టుడే 'అని
ఒక మంచి మాట ఏదైనా వ్రాయడం నాదే బాధ్యత ..ముందు అందుకే వెళ్ళడం ..ఇండియం ఎక్ష్ప్రెస్స్ వార్తా పతిక (
దిన ) నుండి కాపి ..ఇప్పట్లొ దీనినే కాపి అండ్ పేస్ట్ అంటారు కదా ..
విమలా టీచర్ ..అనే తిట్లు పాటల్లా గా ..
దయ్యాలు ,పిశచాలు ..అంటూ శుభ్రమైన ఆంగ్ల భాష లో తిట్లు ..
ఫిష్ మార్కెట్ ..సరే సరి ...అది మామూలు పర్యాయ పదం మాకోసం ..
నిర్మలా టీచర్ ..ఇంగ్లిష్ టీచర్ ..' వెం ఐ వస్ డూయింగ్ మై బీ ఎడ్ ' తో మొదలు అయేవి ..ఆమె పా్ఠాలు ..
ఆవిడ అంటే నాకు ఆరాధన ..అప్పట్లో ..వీలు అయినప్పుడు అలా ..ఒక గులాబి పువ్వు ఇచ్చేదాన్ని ..
లీనా టీచర్ సైంస్ కి , గిరి వర రాజ కుమారి మాథ్స్ కి ..
అందరూ లీలగా కాదు ,కాదు ..బాగా గుర్తు ఉన్నారు ..
చాలా ఆప్యాయం గా , చూసుకుని ,చక్కని చదువు సంధ్యలు నేర్పించారు మాకు ..
నాగ మణి టీచర్, తెలుగు టీచర్ .. రాధామణి అన్నా నాకు ప్రత్యేక అభిమానం ..
ఆవిడే నన్ను ఈ బడిలొ వేసారు ..ఆరో తరగతి లో ..
కాంసెర్ అనే వ్యాధి అని తెలిసి , ఏది రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది అనే బాధ తో ..గుండె ఆగి
పోయారు అని తెలిసిన రోజు ..ఎంత బాధ కలిగిందో ..
రాగయుక్తం గా పద్యం చదివి , ప్రతి పదార్ధం చెపితే ఆమె ..పది కి పది మర్కులు పడిపోతాయని ఇంక గారంటీ ..
అంత గొప్ప టీచర్ ఆవిడ ..
సంగీతం మాస్టరు ,డాంసు మాస్టారు ..కోరాడ గారు .. అందరూ ..మాకు సంగీత నృత్యాలు చెప్పడానికి
ప్రయత్నించేరు ...పార్వతి టీచర్ ..ఆవిడ మంచి నాట్యం నేర్పించేవారు ..
స్కూల్ ఫీస్ సమ్వ్త్సరానికి ..ముప్పై నలభై రూపాయలు ..అంతే ..
ఎనిమిదొ తరగతి లో మద్రాసు ,తిరుపతి , కి విజ్నాన యాత్ర కి తీసుకు వెళ్ళేరు .. ఒక ప్రైవేట్ బస్ ..రావల్సిన
సమయం కంటే ...ఆలెసం గా రావడం ...తర్వాత ..మా పిల్లలల కల కలం ..హడావిడి . ఆ సరదా యత్ర అంతా
ఇంకా గుర్తే నాకు ..
బడి అంటే ఉత్సాహం ...టీచర్లు అంటే భయ భక్తులు , ప్రేమ ,ఆరాధన ..
స్నేహితురాళ్ల తో మైత్రి , కబుర్ల కోలాహలం ..
అన్నీ వేడుక లా తోస్తున్నాయి ఇప్పుడు ..
మేము చదివన ఈ బడి ..ప్లాటినం జుబిలీ ..అంటే 75 ఏళ్ళ పండగ చేసుకుంటొం దిట ..వచ్చే నెల 7 న ..
నేను అక్కడ ఉంటే తప్పకుండా వెళ్ళి ఉండే దాన్ని ..
ఎందుకో మరి , ఇన్ని సార్లు ఏలూరు వెళ్ళినా ఎప్పుడూ మా స్కూల్ కి వెళ్ళ లేదు ..
అంతటి అనుబంధం ఉన్నా ..ఎందుకని మేము వెళ్ళ లేదు అని ఇప్పుడు అనిపిస్తోంది ..
అందరూ మారి పోయారు , మనలని గుర్తు పట్టే వారు లేరని ?? ఒక భావంం ఏమో ?
మా అత్తగారు కూడా ఇదే బడి లో మాథ్స్ టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు ..
మా ఆడపడుచు నేను ..ఇదే బడి , ఇక్కడే మా స్నేహం కి ఆరంభం ..
చదువు ,సంస్కారం . విద్య బుద్దులు నేర్పిన మా బడి కి ..
అభినందనలు ..శుభాభినందనలు ..
పిల్లలు మారి పోతారు , టీచర్లు విశ్రిిస్తూ ఉంటారు ..
కానీ ..చదువు ని నేర్పే ఆ బడి ఆవరణ లో విద్యా కుసుమాలు మటుకు ఇంకా అలా వికసిస్తూనే ఉంటాయి ..
ఆ విద్య వనంం లో మరిని సుమాలు ,నిరంతరం ..తరంం తరం వికసించాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ...వసంత లక్ష్మి .పి.