"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 సెప్టెం, 2014

'కౌగిలి 'ముక్తవరం పార్ధ సారధి..వ్రాసిన చిన్న నవల.
చదివితే మనసు కలత చెంది, ఈ వివాహ వ్యవస్థ ఒక మగవానికి ఎంత అండ గా ఉంటుందో ,ఒక స్త్రీ భార్య గా మారేక, చేసిన అనేక త్యాగాలు, మార్పులు ఆమె జీవితం లో ఎలా అతలాకుతలం చేస్తాయొ, ఇంకా ఆ పై, అమ్మ గా ఆమె శరీరం ఎలా శిధిలం అవుతుందో ,ఆవిడ చివరికి దీనం గా ఎలా ఒంటరి గా నిలబడతుందో.. అన్ని ఎవరొ మనకి విడమర్చి చెప్పినట్టు అర్ధం అవుతుంది.

మీకేం తక్కువ? అంటూ, చీరలు, నగలు, మొదలైన సుఖాలతో ఆమె నవ జీవితం లో ధుఖాన్ని, అసమానతలని కప్పి పుచ్చేలా ,ఈ సమాజం మగవానికి అండ గా నిలుస్తుందో మనకి కనువిప్పు అవుతుంది.

మనోరమ ,బాలు ఒకే ఆఫీసు లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. బాలు ఒక ఏడాది  ఆమె చుట్టూ తిరిగి, పెళ్ళి చేసుకుంటాడు . మనోరమ ఒక మధ్య తరగతి అమ్మాయి, ఒక చెల్లి, తమ్ముడు..తల్లి తండ్రులు ఆమె కుటుంబం.

విచిత్రమైన కుటుంబం, తండ్రి పెద్దగా ఇంటి గురించి పట్టించుకోడు, అందువల్లనేమో అందరూ బాధ్యతా రహితం గా తోస్తారు బాలు కి .
మాట్నీలు, రాత్రి అంతా పేకాటలు, ఎప్పుడు పడితే అప్పుడు కాఫీలు, ఈ వాతావరణం బాలు కి కొత్త .
బాలు వేసే లెక్కలు, పొదుపు ఖర్చులు, సమయ పాలన , ప్లానింగ్ ,మనోరమ కి కొత్త, ఆమె కి కొత్త, ఆమె కి ఫడవు.

పెళ్ళి కొత్త మోజు తీరేక, చిన్న చిన్నగా గొడవలు మొదలవుతాయి. మనోరమ జీతం లో అన్నీ కోతలే, ఎప్పుడు, ఎందుకు చేసావు ఇన్ని అప్పులు అన్న దానికి ఆమె దగార నుంచి సమాధానం ఉండదు.
ఆఫీసు కి అంత అలంకరణ ఎందుకు? అందరితో అంత చనువు ఎందుకు? అని బాలు కి కోపం, విసుగు.
అతనికి ఉద్యోగం లో పైకి రావాలని తీవ్రమైన కోరిక.

మనోరమ మీద కోపం తో కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించక ఆమె ని గర్భవతి ని చేస్తాడు.

రచయిత వాక్యం ఒక చోట..మనుషులు పరస్పరం వాడుకుంటారు.

ఒక పిల్లవాడు పుట్టేక, ఆమె మరింత చికాకు పడుతూ ఉంటుంది, తను తల్లినవడానికి మానసికం గా సిద్ధం కాలేదు
అని ఆమె బాధ. తల్లి అయేక ఆమె మరింత బాధ్యత గా ఉంటుంది అని బాలు ఆలోచన.
కలకత్తా లో ఏదో ట్రైనింగ్ అని చెప్పి నెల రోజులు, చంటి పిల్లాడితో వదిలి వెళ్ళిపోతాడు. తన ఉద్యోగం , పైకి వెళ్ళడం అతని ముఖ్యమైన విషయాలు జీవితం లో, భార్య, పిల్లాడు, కుటుంబం అన్నీ తరవాతే ..

మధ్యలో మరో అబార్షను , మనోరమ ఆరోగ్యం మరింత దిగ జారుతుంది.
అతను పట్టించుకోడు, మళ్ళి ఆమే ఇంటికి వస్తుంది.
మరో సారి గర్భం.. ఒక అనుకోని ఘటన తో ఎనిమిదో నెలలో పాప పుడుతుంది. ఆమె మెదడు కి దెబ్బ తగిలి, బుద్ధి మాంద్యం పిల్ల గా పుడుతుంది.

మనోరమ లో అప్పటి వరకు లేని మాతృత్వం పొంగి ,కూతురిని ఎలాగైనా నయం చేసుకోవాలని తాపత్రయ
పడుతూ ఉంటుంది. బాలు కౄరం  గా ఈ పిల్ల బ్రతకడం దండగ అంటూ ఉంటాదు. ఆమె కన్నీరు పెట్టుకుంటూ ,వైద్యం కి సాయం చేయమని బ్రతిమాలుకుంటుంది. ఆరోగ్యం పూర్తిగా పాడై పోయి, సన్నాగా పుల్ల లా తయారు అవుతుంది. అలాంటి ఆమె ని తన ఖర్మానికి తనను వదిలేసి, బొంబాయి కి బదిలీ అయిందని చెప్పి, కొడుకు ని తీసుకుని వెళ్ళిపోతాడు.
ఆమె ఉద్యోగం కి ఈ బదిలీ సౌకర్యం లేదు అని జవాబు, ఆమె అతనితో వస్తాను అంటే..

అక్కడితో నవల అయిపోతుంది.

కానీ ఆలొచనలు ముసురుకొని, ఏమిటి ఇంత అన్యాయమా? వివాహ వ్యవస్థ లో క్రౌర్యం  మనకి లీలగా అర్ధం
అవుతుంది. మగ వాని ఆరొగ్యం, మనసు, ఇంతగా చితికి పోవు, స్త్రీ మనసు నలిగినంత గా అతని కి బాధ లేదు అంతా సౌకర్యం గా ఉన్నంతవరకు అతనితో పేచీ లేదు. ఒంట్లో బాగో లేక పోయినా లేచి వంట చేసే స్త్రీ చాలా గొప్పదని మనకు నూరిపోసారు. అందుకే మనం అలా సాగుతూ ఉంటాం. దొంగ జబ్బులు అని వెటకారాలు, జబ్బు మనిషి ఎప్పుడూ మూలుగు తూ ఉంటావు అని ఆమె ని హేళన చేయడం.. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఆమె జబ్బులకి అసలు మందులు మాకులూ కూడా ఆలస్యం గానే కనుకొన్నారు అని..

రచయిత ఎక్కడా ఎవరి పాత్రని విమర్శించడు, అలా జరుగుతున్న సంఘటనలను చెప్పుకుంటూ పోతారు.

ఒకసారి బాలు  భార్యకి చెప్పి తన పై ఆఫీసరు ని భోజనానికి పిలుస్తాడు. ఆమె బయటకి వెళ్ళి ఇంటికి రాదు, విపరీతమైన కోపం తో ,తన ఉద్యోగం కోసం ఆమె ని వాడుకోవడానికి రాలేదు కాని, చక్కగా అలంకరించుకుని
,సహ ఉద్యోగులతో కులుకుతూ మాట్లాడుతుంది అనుకుంటాదు..
అంతే కదా.. ఒక స్త్రీ, ఎక్కడ ఎలా మసులుకోవాలో ,ఎలా అలంకరించుకోవాలో ,ఎవరి కోసమో అన్ని ఆమె కి చెపుతుంది ఈ సంఘం. మగ వారు చేసిన ఈ సంఘం. ఎంత అన్యాయం, ఎంత హింస ,కనపడని హింస.

నువ్వు సంఘం చెప్పు చేతల్లో ఉంటే అంతా శాంతి, ఒక్క అడుగు బయటకి పడినా రక రకాల పేర్లు, నీతులు
చెప్పడం..

ఆడవారిని కూడా ఈ కుట్ర  లో భాగం చేయడం.. వారి తెలివి కి నిదర్సనం.

స్త్రీ కి స్త్రీ యె శత్రువు అంటూ ,ఉసి గొలుపుతారు. దయచేసి ఆ మాయలో పడకండి. నేను ఈ నవల చాలా సార్లు చదివాను, నన్ను నేను తెలుసుకోవడానికి  ,నాకు చాలా ఉపయోగపడింది ఈ చిన్న నవల..

ముక్తవరం పార్ధసారధి  గారికి వందనాలు..

2 కామెంట్‌లు:

  1. మంచి నవలను పరిచయం చేసారండి..కథ కొంతవరకు త్రిపురనేని గోపిచంద్, చలం నవలలను గుర్తుకుతెచ్చింది.

    రిప్లయితొలగించండి