"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

27 ఆగ, 2011

నిద్ర పోతున్న వారిని లేప గలం,నిద్ర నటిస్తున్న వాళ్ళని ???

          నా స్నేహితురాలు రమణి తన ఇంట్లో, సాయంత్రాలు, ఒక చిన్న బడి నడుపుతోంది, తన మాటల్లో, ఏడో తరగతి చదువుతున్న అమ్మాయి, తెలుగు అక్షరాలు కూడా రాయలేక పోతోంది, చదవ లేక పోతోంది. ఏడో తరగతి, మన పిల్లలు ఈపాటికి ఐ ఐ టి  కాన్సెప్ట్ కోచింగ్ అంటూ డిగ్రీ వారు చదివే పుస్తకాలు చదివి పడేస్తూంటారు.

ఎక్కడ ఉంది తేడా? అంతరం?? వారు చదివేది ప్రభుత్వ బడులలో, మన పిల్లలు చదివేది, వేలకి వేలు కట్టే ప్రైవేటు స్కూళ్ళ లో ప్రభుత్వ బడులని నిర్వీర్య పరిచే ప్రైవేటు స్కూల్స్ కి ఎడపెడా గుర్తింపు లు మంజూరు చేస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయులను అనేక ఇతర పనులకు ఉపయోగించుకుంటూ, కనీస అవసరాలు అయిన ఒక బోర్డు, ఒక టెక్స్ట్ బుక్,   మంచి నీరు కుళాయి, ఒక మరుగు సౌకర్యం, ఆడపిల్లలకి వేరుగా, ఇంకా ఒక మధ్యాన్న భోజనం, ఒక చక్కని చదువు వాతావరణం, ఇవేమీ ఉండవు. ఆకలి తో వస్తారు పిల్లలు, గోల గోల గా అరుపులు కేకలు, టీచరు  ఉంటే ఉంటారు, లేక పోతే లేదు..ఇలాంటి పరిస్థితి లలో చదువు ప్రాముఖ్యం అంతంత మాత్రమే!
ప్రభుత్వ బడులు ని బాగుపరచడం తక్షణ కర్తవ్యమ్ కాగా, పిల్లలని ప్రైవేటు బడులలోకి పంపడమే, ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు రిక్షా లాగే కార్మికుడు కూడా అప్పు చేసి అయినా ప్రైవేటు బడి లోనే తన పిల్లలని పంపుతున్నాడు. నాలుగు అక్షరాలూ అయిన వస్తాయి అని, తన లాగ కష్టపడ కూడదు అని.

ఏవో పథకాలు పేరు చెప్పి (ఏదో ఒకటి కాదు లెండి, ఒక్క పేరే) కొన్ని ప్రైవేటు వ్యక్తుల ఖజానా నింపడమే ధ్యేయం గా ఫీజు రీమ్బుర్సేమేంట్ అనే ఒక స్కీం మంజూరు అయింది. దాని వల్ల పేద పిల్లలు కూడా చదువు కోగలరు అని అంటున్నారు. కాని, అసలు పునాది లేకుండా భవనం కట్టినట్టు, అక్షరం ముక్క రాకపోయినా పెద్ద చదువులు ఎలా చదువు తారు? ప్రభుత్వ బడులు ని మెరుగు పరిచి, ఉపాధ్య్యయులకు   ప్రోత్సహాకాలు  ఇచ్చి, పిల్లలకి,  పోషకాలుతో కూడిన మధ్యాన్నభోజనాలుపెట్టించి, ఉపాధ్యాయుల్ని బాధ్యులని చేస్తూ , మార్గ దర్శకాలు రచించి, ప్రాధమిక విద్య కి 
అత్యంత ప్రాముఖ్యత  ఇస్తూ , ఎన్నో ఎన్నెన్నో చేయాలి.
నిర్భంద ప్రాధమిక విద్య అనే చట్టం వచ్చింది..ట..మనకి సరిపడా ఉపాధాయులు ఉన్నారా ? అసలు??
ఉన్న బడులని మూసేయకుండా వాటిని చక్కగా నడిపిస్తే చాలు.
మన ప్రభుత్వాలు ఈ విషయాలు తెలియకా??
అందుకే అన్నాను,నిద్ర పోతున్న వారిని లేప గలం,నిద్ర నటిస్తున్న వాళ్ళని లేప గలమా??
ప్రాధమిక విద్య అందరి ప్రాధమిక హక్కు..నేటి బాలలే, రేపటి పౌరులు అని ఊరికినే నినదించడం కాదు, అందు కోసం..నాలుగు అడుగులు ముందుకు వేయాలి,ముందు ఒక్క అడుగు తో మొదలు పెట్టాలి.
వీధి, వీధి కి ఒక సార దుకాణం కాదు ఒక బడి కావాలి.
ఆడుతూ, పాడుతూ,పిల్లలు చదువు ని ఆనందం గా ఆస్వాదించాలి.
చదువు అంటే మార్కులు కాదు, చదువే..అని నమ్మే బడులు..రావాలి.
చదువు కే ఓటు అన్న వారికే నా వోట్ ..
చదువు పిల్లల ప్రాధమిక హాక్కు..కలిసి సాధించుదాం.కదలి రండి. ఇది నా శత బ్లాగ్ టపా.లో విన్నపం.
రమణి..నా స్నేహితురాలి కి ఇది అంకితం,మాటల్లో కాదు ,చేతల్లో చూపిస్తున్న నా స్నేహితురాలు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి