"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 మే, 2015

రాజేశ్వరి కి నివాళు లు

ఒకరు నెమ్మదిగా 
నిష్క్రమిస్తారు 
చడీ చప్పుడూ లేకుండా 
వారు చల్లిన విత్తనాలు 
మటుకు పుష్పించి 
నివాళులు అర్పిస్తూ 
ఆ రోజు తలలు 
వేలాడదీసాయి ,
జెండా అనవతమై నట్టు

మొక్క గా నో
చెట్టు గా నో బ్రతికనపుడు
అనామకులు .
రహదారిలో బాటసారులు
ఒక్కసారి ఆగి
నీడ మహత్తు ననుభవిస్తారు

ఈ రోజు
దారి పక్కన ఒరిగిన
చెట్టు కింద నీడ
మటుకు ఎవరో దొంగలించారు
ఎవరో వారెవరో ..

కాలం రక్కసి లా
కబళిస్తూ
ఆకలి తీరని కాలం కి
ఎంత మంది ని ఆహారం చేసాం ?
ఎన్ని నీడ నిచ్చే చెట్లు ?
ఎన్ని పూలు పూసే మొక్కలు ?
ఎన్ని రంగు రంగుల పూలు ?

ఎంత కనికరం లేనిదీ కాలం .
ఎంత కనికట్టూ ఈ కాలం ..
ఎంత మాయాజాలం ఈ కాలమే
నిన్నలనీ మొన్నలనీ మింగే కాల బిలం
అంచున చూపుతుంది రేపు ..

అస్తమించే సూర్యుడి కే
తెలుసు అస్తమయం తాత్కాలికం అని
ఈ కాలం మటుకు నిర్లిప్తం గా
తన పని తను చేస్తూ ..
అన్నిటికీ ఒక సమయం ఉంది అని
కాలమే ఆఖరుకి మనకి ఓదార్పు
మింగిన కాలమే ..
అంతే ..

మైదానం రాజేశ్వరి గురించి విని చదివి చలించి ..
ఈ నాలుగూ విత్తనాలు వెదజల్లుతూ
వసంత లక్ష్మి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి