"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

20 సెప్టెం, 2011

బ్రాండ్ పవర్..

ప్రతి వస్తువు కి ఒక ఉపయోగం ,ఒక పరమార్ధం ఉంటాయి, కాని, అవి, ప్రజలకు చేరాలంటే ,ఒక బ్రాండ్ పవర్ ఉండాల్సిందే. ఆ మాట కొస్తే,మన భారత దేశం కి ఉన్న బ్రాండ్ ..సాధు ,సన్యాసులు ..ఇప్పుడు కొత్తగా యోగ చేరింది. అక్కడి..విదేశాల లో .. విపరీతమైన వస్తు వినియోగం, మానవ సంబంధాల్లో అస్థిరత, అలజడి తో విసిగి పోయి ...ఏదో మానసిక , స్పిరిచుఅల్ , శాంతి కోసం మన భారత దేశం ,వస్తున్నారు ఎందఱో. ఏ పర్వత సానువు లలో చూసినా , అలుపెరగా కుండా,మన గుడులు , పవిత్ర స్థలాలు ,తిరిగే విదేసేయులు కనిపిస్తారు.ఇదే మన బ్రాండ్ పవర్.

అదే వస్తు వినియోగం, ధన సంపాదన ఆకర్షణ లో మన దేశస్తులు ,విదేశాలకి పయనం అవుతున్నారు, అది వారి బ్రాండ్ పవర్.

తల నొప్పి అంటే అమృతాంజనం, జలుబు, అంటే విక్స్, దగ్గు అంటే గ్లైకొడిన్, చిన్న పిల్లలికి అజీర్ణం అంటే   గ్రిప్ వాటర్ బట్టలు ఉతికే పౌడర్ అంటే సర్ఫ్..బట్టలు ఉతికే పౌడర్ కి ఇంకో మాటే అయిపొయింది, సర్ఫ్ అనే మాట. ఇంకే కొత్త బ్రాండ్ వచ్చినా సర్ఫ్ పొడి ఇవ్వండి అనే అడిగే వాళ్ళం ..

ఇంకా చోకాలేట్ అంటే కాడ్బురిస్ , కూల్ డ్రింక్ అంటే కోకో కోలా..ఇలా బ్రాండ్ పవేర్ లే ఇవన్ని. ఎంతో జాగ్రత్తగా ,ఏళ్ళు తరబడి, క్వాలిటీ , అడ్వెర్ టిస్ మెంట్ తో నిలబెట్టిన బ్రాండ్స్ ఇవి. ఈ బ్రాండ్స్ తయారు చేయడానికి వెనక ఎంత మందిదో శ్రమ ,ఆలోచన, వ్యూహం ఉంటాయి.
ఈ మధ్యే మన దేశం ..లోని వైవిధ్యం, సుసంపన్న మైన , సువిశాల మైన మన సుందర భారతం , అతి పురాతన మైనా, చెక్కు చెదరని ఆలయ సంపదలు,  పులకింప చేసే నదులు, నది తీరాలు, హంపి, హోయసల, అజంతా ,ఎల్లోరా , రామప్ప , కొనరాక్, ఖజురహో, ఓహో, ఎన్ని సుందర  విగ్రహాలు, శతాబ్దాలుగా చెక్కు చెదరని హొయలు, సొగసులు , ప్రపంచం లోనే వింతల్లో ఒకటైన వింత , అందమైన వింత, యమునా నది తీరాన వెలిసిన తాజ్ మహల్ , వేల సంవత్సరాల క్రితమే వేల ,వేల విద్యార్ధులతో విలసిల్లిన నలందా, నాగార్జున విశ్వ విద్యాలయాల అడుగు జాడలు కనిపించే వేద భూమి, ఈ పవిత్ర భారత దేశం ..గొప్పదనాని ఇనుమడింప చేసే ..స్లోగన్.. ఇంక్రెడిబెల్ ఇండియా ..అనే స్లోగన్.

ఇదే బ్రాండ్ పవర్. మన భారత్ దేశానికి వచ్చే యాత్రికుల  సంఖ్య ని ఇబ్బడి ముబ్బడి చేసింది. చినీయులు, జపనీయులు, బుద్ధుడి అడుగు జాడలు వెతుక్కుంటూ, యూరోప్ దేశం నుండి, మన సముద్ర తీరాల లో మునకలు వేస్తూ,  చల్లని దేశాల నుంచి మన వెచ్చని సముద్ర తీరాలు  లో టాన్ అయేందుకు, మన సాదు, యోగి పురుషుల సాంగత్యం లో స్వాంతన ,పొంద దానికి, ఎందఱో, ఎంత మందో విదేశీ యాత్రికులు వస్తున్నారు..
ఇంక్రెడిబెల్ ఇండియా అని మురిసి పోతూ ,ముచ్చటించు కుంటూ, వెనక్కి వెళుతున్నారు.
అది బ్రాండ్ పవర్ ఒక్కటే కాదు, మన దేశం గొప్పతనం అంటారా? మన దేశం ..అంటే తెలియని వారి కి కూడా ,ఈ స్లోగన్ ఆకర్షించింది.. అంటారు.

ఏదైనా బ్రాండ్ తాయారు చేయడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది.

మహాత్మా గాంధీ అంటే నిరాహార దీక్ష , సత్యం, అహింస ..అని,

నెహ్రు అంటే, శాంతి కాముకుడు, అలీన దేశాల కూటమి అని,

లాల్ బహదూర్ శాస్త్రి అంటే..జై కిసాన్,జై జవాన్..అని...ఇప్పుడు  మర్చి పోయేరు కాని,
ఇందిరా గాంధి అంటే ఐరన్ లేడి ,అని,

ఇలాగ ఎన్నో ఉదాహరణలు.

కాని, ఒక్క పదిహేను రోజుల్లో కూడా బ్రాండ్ తాయారు అవుతుందని, అది ఎంతో పవర్ ఫుల్ గా..అని ఊహించలేదు ఎవ్వరూ..

అదే,అన్న హజారే బ్రాండ్.. లక్షల మందిని, లంచాలు, ప్రభుత్వ అలసత్వం, చూసి, విసిగి పోయిన, పెద్దలు, పిల్లలు, మధ్య తరగతి, పై తరగతి, కింద తరగతి, చదువు కున్న వారు, చదువు కోలేని వారు, చదువు రాని వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వారూ, వీరూ, అని లేదు, అందరిని, భారతీయులన్దిరిని , కదిలించింది, ..మన దేశం లోనే కాదు, విదేశాల్లో ఉన్న మన దేశస్తులు, కూడా ఇందులో భాగం అయిపోయారు.
అన్నా హజారే ..టోపీలు, అన్నా హజారే బాండ్స్,అన్నా మాటలు, నినాదాలు, అన్ని ఒక బ్రాండ్ ..పవర్ఫుల్ బ్రాండ్ ఏర్పడింది.

ఈ బ్రాండ్ ,ప్రజలు తాయారు చేసిన బ్రాండ్.. చిర కాలం నిలిచే బ్రాండ్ అవుతుందని ఆశిస్తూ..



4 కామెంట్‌లు:

  1. అన్నా హజారేకి మనమనుకున్నంత పాపులారిటీ లేదు. మా పట్టణంలో కొంత మంది అన్నా హజారేకి మద్దతుగా ఒక పూట నిరాహార దీక్ష చేసి ఫొటోలలో పోజెస్ ఇచ్చి విలేఖరులు వెళ్ళిపోయిన తరువాత శిబిరం ఎత్తేశారు. అవినీతికి వ్యతిరేకంగా మనవాళ్ళు చెప్పేవి పైపై కబుర్లే కానీ చేసేదేమీ ఉండదు.

    రిప్లయితొలగించండి
  2. అదే ప్రవీణ్ శర్మ గారు, బ్రాండ్ పవర్..అందరికి అన్నా టోపీ పెట్టుకోవాలని ఒక ఫాషున్ అయింది కదా, లంచ గొండి తనం ఒక్క రోజు లోనో, ఒక్క చట్టం తో నో పోయేది కాదు.
    మన తో నే మొదలు అవాలి, లంచాగొండులకి శిక్ష పడుతుందని భయం కలగాలి, ప్రభుత్వ కార్యాల లో పనులు చార్టర్ ప్రకారం పని జరిగేలా పై అధికారులు పూను కోవాలి, అంతటా ట్రాన్స్ పరెంసి పెరగాలి..
    ఈ లోపల అన్నా టోపీలు పెటుకునే వాళ్ళు పెరుగుతారు..అది ఒక భయం..నింపుతుంది..అని ఒక ఆశ.
    వసంతం.

    రిప్లయితొలగించండి
  3. గాంధీ పేరు చెపితే ఎంత మంది భయపడతారు? భయపడేవాళ్ళు లేరు కానీ ఏడాదికి రెండు సార్లు (గాంధీ జయంతినాడు, గాంధీ వర్ధంతి నాడు) గాంధీ పేరు స్మరించి, మిగితా రోజులు విస్మరించేవాళ్ళు ఉన్నారు. అన్నా హజారే పేరూ అంతే. కార్మిక విప్లవం పేరు చెపితే కొందరు భయపడతారు. 1991లో సోవియట్ యూనియన్ రద్దు చెయ్యబడినా ఇప్పటికీ ఆ దేశం కొందరి గుండెల్లో నిద్రించే సింహమే. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ భయపడరు. అవినీతి పోయినంతమాత్రాన సామాజికంగా పెద్ద మార్పులేమీ రావని వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు మా నాన్నగారు లంచం ఇచ్చారు. నా పదో తరగతి సర్టిఫికేట్ మీద నాన్నగారి పేరు తప్పు వ్రాస్తే మార్పించడానికి నూటయాభై రూపాయలు లంచం ఇవ్వాల్సి వచ్చింది. మా నాన్నగారు నూటయాభై రూపాయల కోసం వీధి పోరాటం ఏమి చేస్తాం, మన పని మనం చూసుకుందాం అని వైయుక్తికంగానే ఆలోచించారు. ఆర్థిక అంశాల గురించి మాట్లాడితే ఆర్థికంగా వెనుకబడిన వర్గంవాళ్ళైనా తమ హక్కుల కోసం పోరాడుతారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే నూటయాభై రూపాయల కోసం అనవసరమైన గొడవలెందుకు అనుకుని నోరు మూసుకుంటారు. వ్యాపారం పెట్టకముందు నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయని ట్రైన్‌లో టికెట్ లేకుండా ప్రయాణించాను. విజయనగరంలో ట్రైన్ దిగి స్టేషన్ వెనుక పట్టాలు దాటుతోంటే ఒక రైల్వే కానిస్టేబుల్ అడ్డగించి డబ్బులు అడిగాడు. పదిహేను రూపాయల టికెట్ లేని ప్రయాణానికి ముప్పై రూపాయలు లంచం ఇచ్చాను. సాధారణ ప్రజలు లంచాలతో తమకి పోయేది పది, పాతిక మాత్రమే అనుకుని అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చెయ్యరు. వ్యక్తిగత పాపులారిటీ కోసం పాకులాడే రాందేవ్ బాబా లాంటి కొంత మంది ధనవంతులు మాత్రం టెంట్‌లలో కూలర్లు పెట్టుకుని విలాసంగా నిరాహార దీక్ష చేస్తారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం యొక్క స్థితి ఇలా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. నిజమే నండి, మీరు చెప్పిన వన్ని ఎక్కడి కక్కడ, మన పని అయితే చాలు అనుకుంటాం, పాస్ పోర్ట్ కి, రేశున్ కార్డ్ కి, ఆఖరికి అదార్ కార్డ్ కి కూడా లంచమే నట.
    ఇదే మన బ్రాండ్..అనుకుందాం..
    వసంతం.

    రిప్లయితొలగించండి