"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

24 అక్టో, 2010

విలక్షణ మైన ప్రేమ కథ ??

కళ జీవితం నుంచి పుడుతుంది అంటారు.  కొన్ని కథలు చదువుతూ, ఇలాంటివి కథల్లో నే జరుగుతాయి, నిజం గా జరుగు తాయా? అని పెదవి విరుస్తాం.  హిందూ పేపర్ లో ఈ వార్త  కథనం నన్ను చాల కదిలించింది.  మీతో పంచు కోవాలని రాస్తున్నాను. 
మనోహర్ దేవదాస్ గీసిన చిత్రాలు, మహేమా మరియు సీత కోక చిలుకలు.. అనేవి లక్షణ ఆర్ట్ గేలరీ లో ప్రదర్శింప  బడు తున్నాయి.  ఏమిటి వీటి ప్రాముఖ్యం అంటున్నారా?  ఇవి వేసిన మనోహర్ కి కళ్ళు కనిపించవు.  జీవిత సహా చారిణి మహేమ జ్ఞాపకాల తో వీటిని గీస్తున్నాడు మనోహర్. ఆమె ను ఎంతో ఇష్ట పడి, ఆమెను తన ప్రేమతో , గెలుచు కున్నాడు ట. ఎన్నో ప్రేమ లేఖలు రాశాడుట. తన జీవితం లోకి ఆమె వస్తే,  ఎంత  బాగుంటుందో,  తన ప్రపంచం లోకి ఆమె ఎన్ని రంగులు నిమ్పగాలదో అని  వర్ణిస్తూ, ప్రేమ లేఖలు రాసి ఆమె ను ఒప్పించి , ఆమె ను వివాహం చేసుకున్నాడు.
తొమ్మిది సంవత్సరాలు మధురమైన జీవితం గడిపాక ,ఒక రోజు వారి కార్ ఒక లారీ కి గుద్దుకుని ఆక్సిడెంట్ అయింది. ముప్పై రెండు ఏళ్ల మహేమా మెడ కింద నుంచి పక్ష వాతం తో లేవ లేని స్థితి లో ఉంది పోయింది.

చిన్న చిన్న కారణాలు, పెద్దవి చేసుకుని విడి పోయే దంపతులు ఇది చదివి తీర వలసిందే.. 

మామూలు , శరీరాకృతి  కలిగిన మనోహర్, వ్యాయామం  చేసి తన చేతులను దృఢ పరచుకుని, కదల లేని తన భార్య ని తన చేతుల మీదు గా ఇంట్లో తిప్పేవాడుట  . కష్టాలు అన్నీ ఒక్క సారే   వస్తాయి అన్నట్టు ఇదే సమయం లో మనోహర్ కళ్ళకి ఏదో వ్యాధి వచ్చి అతనికి కళ్ళు కని పించడం మానేశాయి ట.
నాకే ఇన్ని కష్టాలు వస్తాయి అని బాధ పడుతూ, కన్నీళ్లు కారుస్తూ కూర్చో కుండా, వీరు    ఇరువురు, ఒకరి కోసం ఒకరు నిలిచి,  కథలు వ్రాస్తూ, చిత్రాలు గీస్తూ, వాటిని అమ్మగా వచ్చిన డబ్బు హాస్పిటల్ ల కు,  దాన సంస్థ లకు ఇచ్చేవారుట.

 "వైగై సూర్య అస్తమయం " అనే చిత్రం ఒక మరణ అవస్థ ను ప్రతి బిమ్బించే చక్కని చిత్రం.. లే లేత గులాబీ రంగు, నారింజ , వోఇలేట్  రంగుల  మబ్బులు , కుంగి పోతున్న సూర్యుడు , ఈ చిత్రం లో కనువిందు చేస్తాయి. 
ఇంకో క చిత్రం. పసుపు పచ్చని  నదిలో, ముగ్గురు నడుం వరకు మునిగి ఉన్న దృశ్యం ..అడవి ఆడ పడుచు , ఒక చిత్రం లో, ఎన్నో, ఎన్నెన్నో చిత్రాలు, అతని మదిలో జ్ఞాపకాల గని నుంచి తవ్వి, ఆ జ్ఞాపకాలకు రంగులు అద్ది, చూపే లేని తన కళ్ళతో ఒక దృశ్యం ను మనసు చక్షువు లతో ఆవిష్కరించాడు. 

 నమ్మలేని విషయం లాగ ఉంది కదూ.. తెలుపు లో ఏడు రంగులు ఉంటాయని విన్నాం, మనకి తెలుసు, నలుపు లోంచి కూడా ఇన్ని రంగులా?  తన సహచరిణి కూడా మరణించింది.. రెండు వేల ఎనిమిది లో..

అయినా ఆమె జ్ఞాపకాలతో అతను బొమ్మలు గీస్తునే ఉన్నాడు.  అతను ఆమె కు రాసిన ప్రేమ లేఖలు గుర్తు చేసుకుని, ఆ మాటలు, ఆ ప్రమాణాలు, ఆ ఊహలు, ఆ కలలు కి రూపం కలిపిస్తున్నాడు. 

ఎలా గీస్తారు? ఈయన ఎందుకు గీస్తారు? ఈయన అనే  ప్రశ్నలు ఉదయిస్తాయి.  అతని కి పోయింది దృష్టే కాని అతని లోని కళ దృష్టి కాదు అని ఒక సమాధానం. 

ఎలా? అంటే... త్రికోణ మితి అనే మాథ్స్ పరిజ్ఞానం , వందల్ కొద్ది  ఫోటోలు తీసి, ఆ వస్తువులకి , కళ్ళకి ఒక అరుదైన మందు చుక్కలు వేసుకుని, కను గుడ్లు పెద్దవి అవడానికి, + ముప్ఫై పవర్ ఉన్న కళ్ళ అద్దాలు, చాల ఎక్కువ లైట్ ఇచ్చే లైట్ వెలుతురూ లో, భూత అడ్డంలు వాడుతూ, చేతికి గ్లోవేస్ వేసుకుని,  ఈ వేడి కి చెమటలు పడితే, చిత్రం పాడు అవకుండా, ఇన్ని కష్టాలు పడుతూ, అతను చిత్ర్రాలు గీస్తున్నాడు. 

అతను గీసిన చిత్రం , మొత్తం స్వరూపం కూడా అతను చూడలేడు  . ఒక రూపాయి కాసంత మేర మాత్రమే, చూడ గలడు  .. అయినా అద్భుత  మైన చిత్రాలు, మనసు ని మైమర పించే చిత్రాలు గీస్తున్నాడు అతను. ప్రేమ భావన  కే రంగులు అద్దు తున్నట్టు,  తన లోనే నిలిచిన , ఆమె స్మృతులు కి రూపం ఇస్తూ,  కొనే వారికి , ఒక ప్రియ మైన జ్ఞాపకం కొనుక్కుని వెళుతున్న ఒక అనుభూతి. విలువ కట్టలేని ఒక చిత్రం.. ప్రతి చిత్రం..

ముప్ఫై మూడు పైన్టింగ్స్ లో మూడు మాత్రమే మిగిలి ఉన్నాయిట. లక్షణ ఆర్ట్ గాలెరి లో. ఇవి అమ్మగా వచ్చిన డబ్బు, శంకర్ నేత్రాలయ కీ, అరవింద్ కంటి ఆసుపత్రి కి వెలతాయిట.

ధన్యుడు మనోహర్ దేవదాస్ .. ధన్యు రాలు మహేమా.
ఇది నిజం గా ఒక విలక్షణ మయానా ఒక ప్రేమ కథ కదా?? 
 

3 కామెంట్‌లు: