"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

25 అక్టో, 2010

ఆకలి -ఆహారం- ఎవరు పేదవారు?

ఆకలి -ఆహారం- ఎవరు పేదవారు? ఈ విషయాలు చర్చించడానికి NAC అనే ఒక ఉన్నత అధికారుల సముదాయం.. కి ఎట్టకేలకు సమయం దొరికింది. సుప్రేం కోర్ట్ అనే ఉన్నత న్యాయ స్థానం ఈ మధ్యనే, ఎలుకలు తింటున్నాయి, వర్షం లో నాని పాడయి పోతున్నాయి మన తిండి గింజలు వృధా అయి పోతున్నాయి అనే వార్త కి స్పందించి, వెంటనే మూడు పూటలా భోజనం చేయని మన దేశ ప్రజలు కి ఉచితం గా నయానా పంచి పెట్టమని ,మన అలసత్వ ప్రభుత్వం కి చీవాట్లు వేసింది. మంత్రి వర్యులు, అంతర్జాతీయ క్రికెట్ అనే క్రీడ లో అతి ముఖ్య మైన విషయాలు చర్చిస్తూ, చాల బిజీ గా ఉన్నాం అన్నారు, ప్రధాన మంత్రి గారు , ఫైనాన్సు గురించి మాట్లాడారు, ఎవరు ఏమి అన్నా ,న్యాయ అధికారులు మళ్లీ, మళ్లీ ,ఇదే విషయం గుర్తు చేస్తే, మొత్తానికి ఎవరికి పంచాలి? ఎవరు నిజం గా బీద వారు? ఎవరు రోజుకి వచ్చే వంద రూపాయల కూలి తో , బియ్యం, పప్పు, కూరలు, ఇంకా బలం ఇచ్చే ఒక గుడ్డు, ఇంక పాలు, కొనుక్కోలేరు, ఎందుకు ఇలా నీరసం గా ఉంటారు? ఎందుకు పిల్లలని బడి కి పంపించరు,  ఎందుకు చిన్న పిల్లలు కి వచ్చే వ్యాధులు నుంచి కాపాడ లేరు? ఎందుకు? ఎందుకు?  
వారికి వచ్చే కూలి సరిపోదు అని మన లాంటి వాళ్లకి తెలుస్తుంది కాని , ఎక్కడో సెంటర్ అంటే ఢిల్లీ లో కూర్చునే వారికి ఎలా తెలుస్తుంది. మన ఇళ్ళల్లో పని చేసే పని వారు, ఏమి తినకుండా నే పనిలోకి వస్తారు అని తెలిసిన రోజు ,నేను ఆశ్చర్య పోయాను. జీతం అంతా ఏం చేస్తారు? ఇంట్లో అందరు సంపాదిస్తారు కదా? మన ఇంట్లో లాగ కాదు, ఒకరు సంపాదిస్తే నలుగురు తినడానికి.. అనుకున్నాను. కాని వారికి ఎప్పుడో ,ఏదో శుభా కార్యం కి చేసిన అప్పో, లేదా హాస్పిటల్ కి చేసిన అప్పో, ఇల్లు కట్టుకోవడం, అనదిక్కర స్థలం లో, ఎవరికో డబ్బు కట్టి, ఈ అప్పు వారిని కాన్సెర్ (క్షమించాలి ,ఈ పదం వాడినందుకు, ఇప్పుడు కాన్సెర్ కి మందు ఉంది, మునుపటి లాగ కాదు అని తలుసు, అలవాటు  గా పడి పోయే కొన్ని పదాలు ఇవి) లాగ పీడిస్తూ ఉంటుంది. నెల నెల, లేదా వారం వారం వారు కొంత డబ్బు కడుతూ ఉంటారు. మనకి పొద్దున్న లేస్తే, ఈ పూట బ్రేక్ ఫాస్ట్ కి ఏం వండాలి   , బోర్ కొట్టకుండా, రోజు కో రకం చేసి పెట్టాలి, ఇలాంటి సమస్యలు ఉంటాయి. వారికి ఈ రోజు బియ్యానికి పైసలు ఎవరు ఇస్తారు? ఇంట్లో అందరికి అన్నం కడుపు నిండుగా పెట్ట గలనా? రేశున్  కొట్టు మీద బియ్యం ఏ మూలకి  వస్తాయి. మన లాగ లెక్క గా తినరు కదా,  కంచం నిండుగా ఇంట్లో అందరికి అన్నం, ఏదో ఒక కూర వండాలి అంటే ఎంత చూసుకోవాలి? ఆ ఇంట్లో ఆవిడ? మనం ఇచ్చే జీతాలు , నెలకి ఒక సారి ఇస్తాం, నెల అంతా సరి పోతుంద? మన కి  కొంచం ,కొంచం అర్ధం అవుతాయి వారి కష్టాలు.
ఇంక   ఏ మాత్రం పనులు లేని ఒక మారు మూల పల్లెటూరు ఊహిస్తే, చేద్దాం అన్నా పని ఉండదు. పొలం పని చేద్దాం అంటే, కరువో, వరదలో, ఏదో ఒకటి పీడిస్తో, పనులే దొరకవు. ఇప్పుడు వంద రోజులు పని పధకం లో కొంత నయం అంటున్నారు  . 
ఈ నేపధ్యం లో ఎవరు? పేద వారు? ఎవరికి ఈ తిండి గింజలు పంచాలి అనే ఒక మహా సమస్య లో పడి పోయారు. ప్రభుత్వం వారు. 
ఈ మధ్యనే, అడవి లో దుంపలు తవ్వుకుని తినే వారి గురించి రాసారు. మూడు పూట్ల తిండి కోసం పల్లెలు వదిలి, రోజు కూలి చేస్తూ, పట్టణాల్లో, ఆకాశం కిందే పడుకునే  మైగ్రంట్ కూలీలు కని పించరా? మట్టి లో ఆడుకునే మన దేశ భావి పవురులు కని పించరా? 

మన  దేశం మన ఆకలి ఇన్దెక్ష్ ని చాల కింద కి చూపిస్తూ అవాస్తవాలు ని ప్రచారం చేస్తోంది అని అనేక సంస్థలు చెప్పేరు. ఎత్తైన భవనాలు , షాపింగ్ కాంప్లెక్స్ లు, పట్టణాలు లో అభివృద్ధి , రోజు రోజు కి పెరుగు తున్న సెన్సెక్స్ వీటి మెరుపుల  కాంతి వెనుక ఒక నీడ లాంటి చీకటి ఉంది. అది మన ప్రభుత్వం లో పెద్దలకి కనిపించదు. కళ్ళు తెరిస్తే కని పిస్తుంది.

 ఎందుకు అంత నిరాశ గా రాస్తారు? ఎంత అభివృద్ధి చెందింది మన దేశం దీని గురుంచి రాయ కూడదా? అంటారు కొందరు. మన దేశం లో అరవై శాతం ప్రజలు, ఆకలి తో నే కాళ్ళు మూడు చుకుని పడు కుంటున్నారు అని, చివరకు ఈ రోజు తేల్చారు. వీరినే BPL  అని ఆ గీత కింద ఉంటారు అని అంటారు  . 

పోనీ  ,ఇప్పటికైనా మేలు కున్నారు. వీరికి మూడు రూపాయలకి , గాని, ఇంక తక్కువకే ఆహార పదార్ధాలు సరఫరా చేస్తారు ట.  ఆచరణ లోకి తేవడానికి ఎన్ని రోజులు పడుతుందో కానీ, ఎప్పటి కప్పుడు, వీరికే సరిగ్గా అందు తున్నాయి అని చూసేందుకు కూడా ఇప్పుడే నియంత్రణ లు పెట్టాలి, మొన్నటి వరకు ఎలకలు తిన్నాయి ట, ఇంక వేరే పంది కొక్కులు లాంటి వ్యాపారస్తుల బారిన పడకుండా కాపాడాలి. 

మన దేశం లో, అన్నీ ఉంటాయి, పేపర్ మీద. కాని అంద వలసిన వారికి అందవు అవీ. కాని, దేశం ఇలాగ ఈసురో మని ఆకలి తో ,నీరసం గా మూలుగు తూ ఉంటే, ఒక్కరైనా అంటే ఇరవై శాతం అయితే ఫర్వ లేదు అన్నట్టు కాదు, ప్రతి ఒక్కరు, కడుపు నిండా తిన గలిగి ఉండాలి, ఇదే మన దేశ గొప్పతనానికి నిర్వచనం. ఈ కల నిజం చేయడానికి ,పూనుకోవాలి.

పంచవర్ష ప్రణాలికలు , బడ్జెట్ లు, ప్లానింగ్ కమీషన్లు, మంత్రి వర్గాలు, ప్రభుత్వ పథకాలు, అధికారులు అన్నీ, అందరు.. ఈ దిశా గా ఆలోచించాలి, అంటే గీటురాయి అంటారు, అలాగ, ఈ రోజు ఎంత మంది హాయిగా ,కడుపు నిండా తిన్నారు? ఎంత మంది ఆకలి తో ఉన్నారు? ఎందుకు? అని ఆలోచించే రోజు రావాలి.  ఆ రోజు దేశం నిజం గా అన్నపూర్ణ మన దేశం అని పాడు కునే రోజు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి