నా సాహిత్య ప్రస్తానం ..ఇంకా బుడి బుడి అడుగులతో..పసితనం దాటిందా ? లేదా
అన్నట్టుంది..
రాయడం అనేది..నాకు ఊహ వచ్చినప్పుడు .చదవడం తో మొదలు అయింది అని చెప్పవచ్చు..
అక్షరాలూ దిద్ద గానే, పత్రిక ల లో వాటిని వెతుక్కోవడం మొదలు పెట్టాను.
పత్రిక ల లో సేరియాల్ చదవడం...బహుసా ,ఏ ఎనిమిది యేళ్ళ
నించో మొదలు అయింది..అలా చదవడం...అనే ప్రక్రియ నాతో పాటూ పెరుగుతూ వచ్చింది.
అక్షరం అంటే ప్రేమ కూడా పెరిగి, నేను కూడా పున్జీడు అక్షరాల విత్తనాలు
చల్లోచ్చు ,ఈ సాహితి వనం లో అని ఆలోచన కలిగింది..
నాకు సంతోషం ,బాధ ఏమి కలిగినా అది అక్షరాల లోకి మార్పు చెందడం ,నాకు
తెలియకుండానే జరిగిన ప్రక్రియ..
అక్షర రూపం లో ఏవి ఉన్న చదవడం...ఆ అక్షరం..మనసు లో తిష్ట వేసుకుని, నన్ను
కదిలించడం..నాకు ఆనందం కలిగించడం..ఇవన్ని నేను గమనిన్చేసరికి..నాలో ఒక కవి
,రచయిత నాలో కూడా ఒకరు ఉన్నారని ..
ఊహు..నేను గమనించలేదు, కాని, పేజీలు ,పేజీలు నేను రాసిన ఉత్తరాలు అందుకున్న
నా స్నేహితులు గమనించారు..
ఉద్వేగం, కన్నీళ్లు, సంతోషం, ఆలోచన , ఉత్తేజం , నిస్తేజం..ఒక్కో సారి...ఈ
భావాలన్నీ నేను నా ఉత్తరాల లో ,ప్రకటించడం..ముందు నా స్నేహితురాళ్ళే
గమనిన్చేరు..
మా ఊరు, ఏలూరు అప్పుడు, రాజకీయ చైతన్యం తో, రాజుకున్న నిప్పు రవ్వ లాగ రవ రవ
లాడుతూ ఉండేది..మా ఏలూరు..
ఉద్యమాల పిలుపు లు ఏర్రేరగా ఆకర్శించేయి..
చదువు ఏమాత్రం నిర్లక్షం చేయ కుండానే..ఒక అడుగు అటు వేసాను..
అప్పుడు జనార్దనం అనే ఎంజేనీరింగ్ విద్యార్ధి ని ఎంకాంటర్ చేసి చంపేశారు, అతని
ని ఒకసారి కలవడం వల్ల ,విపరీతం గా దుఖం కలిగి, రాసిన నా కవిత ఇది.
జనం..(జనార్దనం )
ఆ రోజు ఉదయం ఉదయం కాలేదు
అస్తమయాన్ని ఆకాశం నిశబ్దం గా
చితికి పోయే పురిటి సూర్యుడ్ని
పొత్తి బట్ట తో ఎత్తుకొచ్చాడు మావాడు.
ిన బింబాన్ని పిండి గుండెల్లో నింపుకుని
వేడిని కరిగిస్తూ లోపల మెత్త బడిపోతూ
నెత్తిన పాలు పోస్తాదంటూ చల్లగా నిష్క్రమించాడు
నిష్క్రమణ -----ఈ గోళం వదిలి
కాంతి వేగం తో వెలుతున్నాడే మో అని ఆశ
అందుకే జన హృదయం కన్నీటిని కట్ట బెట్టి
ఎర్ర మందారం గుండెల కెత్తి
నంది వర్ధనం జనం హృదయం
శాంతి కపోతం ప్రాణం విడిచింది ..
ఎర్ర ముక్కు కోడిపెట్ట తోలి కేక గా అవతరించి
జనం ..జనం ..అంటూ తొలివేకువ కూసింది..
కాంతి వేగం తో వెళుతూ
తిరిగి వస్తున్నాడు మా వాడు ..
తిరిగి వస్తూంటాడు మా వాడు..
మరోటి..
నా యవ్వన వయసు లో రాసినది..
వికృతి.
ఒంటరి దాన్నిని చిట్టడివి లో
ముట్టుకుంటే అడవి తీగె పామై కూర్చుంది
విరగ బూసిన పచ్చదనం నర నరాల అసహనం
వింత వింత పొదుగుల కి ఎదిగి కూర్చున్నాయి
మొదళ్ళు ..
తమ చుట్టూ నల్లదనం మింగేసు క్కూచున్నాయి
పలచని ఎడారి నా చుట్టూ చిక్కగా
మేటేసిన తెల్ల రజను ఆడ దాని గుండెల్లా
ఇసిక తుఫాను హోరుల్తో కళ్ళ లలో ఆర్తనాదం
మొదలు లేని చెట్టు లా నాలోనే దిగబడింది.
చలిని గడ్డ కట్టించే మంచు
మమ్మీ లా కూరుకు పోయి ,పాత సున్దర్యం
కిలుము పట్టిన గుండె నాడులు
కాళ్ళు సాగని మంచు తీగెలు ,నర నరాల
పిరికి మంచు ,కరిగించే సూర్య రస్మి కి
వేయి జనాల మంద 'మతి 'అడ్డు
ఉషోదయం నవోదయం
గుండెల్లో పీచు పీచు మాటలు
గుడ్డి మాటలు, మూగ కళ్ళు లా అంతా
తిక మక .....మక తిక..తిక్క
-----------------------------------------------------------------------------
అంతలోనే వెలిగి ఆరిపోయింది..
నాలో విప్లవ దీపం..
అయ్యో .ఎందుకు ఇలా
అలా అని, నాలో లేని
ఆవేశాలు , నేను ప్రదరసించ లేను..
అది నాలో నిజాయితే యో తెలియదు..
తప్పించు కోవడమో తెలియదు..
పై చదువులు, ఆంధ్ర యూనివర్సిటీ లో..తర్వాత పెళ్లి..ఇంకా ఆ పై పిల్లలు, వారి
చదువులు...ఇవి ముఖ్యం అయిపోయాయి..నేను వెనక బడ్డాను...ఆమె, అమ్మ ...పైకి
వచ్చాయి..
మళ్లీ చాల రోజులకి...లేదా ఏళ్ళకి ..కువైట్ లో నాకు నన్ను నేను కనుక్కునేందుకు
సమయం దొరికింది..
మళ్లీ రాయడం మొదలు పెట్టాను...బ్లాగ్స్ లో నా కథలు, కవితలు, నా భావాలు అన్ని
పొందు పరచడం, పేస్ బుక్ ద్వారా..పది మందికి పరిచయడం పెరగడం,, జగతిధాత్రి గారు,
ఒక కవిత ప్రచురించడం..బాగున్నాయి అని ఎవరయినా మెచ్చు కోవడం..
అన్ని ఈమధ్య కాలం లోనే..ఈ రోజు ఇలా మీముందు నిల్చున్నాను అంటే..
అంతా నెట్ కాల మహత్యం అని చెప్పా వచ్చు..
ఇంకా ఈ ప్రస్థానం కి మొదలు ఇది..
ఏ తీరం చేరుతుందో ..చూడాలి మరి..
మీ వసంత లక్ష్మి ..
మొన్న ఆ మధ్య ,విశాఖ సహృదయ సాహితి సమావేశం లో జరిగిన సభ లో నా ప్రసంగం..నా కవిత లు కొన్ని కూడా చదివాను ఇక్కడ..నా సాహిత్య ప్రస్థానం అంటూ ఇంకా ఏమి మొదలు అవలేదు..ఇది ఇంకా నా తోలి అడుగు మాత్రమే ..వీటినే మెచ్చ్కుని ,అంతు లేని ఆత్మ విశ్వాసాన్ని కలిగించిన ప్రతి ఒక్క సహృదయుని కి నా నమస్సుమాంజలి..ధన్యవాదాలు...ఇంకా ఈ ప్రస్థానం సాగుతుందని ...నాకూ ఆశే..ఉంటాను మరి..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి