ఇంకా ఉన్నాయి.. చాలా ఉన్నాయి .. అఫీసియల్ కాలనీ ముచ్చట్లు . చిన్నతనం ,బాల్యం అంటే నే అమాయకత్వం , స్వచ్చమయిన మనసులు, కలుపుగోలు మాటలు, పెనవేసుకున్న బాంధవ్యాలు ..
మనం పెరుగుతూ ఉంటే ,కొన్ని బంధాలు విడి పోయి, మనం దూరం అయిపోతాం ... కాని, బాల్యం ఎడారి లో కనిపించే ఎండమావి లాంటిది, బాగా అలిసి పోయాం , ఈ జీవనబాట లో అనిపించి నప్పుడు ,ఒక్కసారి ఈ ఎండమావి లోకి వెనక్కి నడిచి , తొంగి చూస్తే మనసుకి ఎంత హాయో ??
మా శారదా బాల విహార్ లో తరగతి లో మంచి పిల్లలు , అల్లరి చేయని పిల్లలకి ఒక బహుమానం అని చెప్పి ఒక చార్ట్ ,తయారు చేసి పెట్టేరు , అందులో ప్రతిరోజూ మన మంచి ప్రవర్తన కి ఒక ఎర్ర గుర్తు ,అల్లరి , మాట వినక పోవడం కి ఒక నల్ల ఇంటు పెట్టే వారు.
ఎవరికి ఎక్కువ ఎర్ర గుర్తులు వస్తే ,వారికే ఆ బహుమానం, నేను చాలా బుద్దిగా ఉండి ,చాల సార్లు గెలుచు కున్నాను.
తర్వాత ఏలూరు లో కూడా తెరిసా హై స్కూల్ లో కూడా అంతే ,ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ,అంతే కాదు స్కూల్ గెట్ తెరిచే టైం కి నేను ఉండాల్సిందే , విశాలమయిన ఆ స్కూల్ లో మొదట అడుగు నాదే అన్న మాట .
ఒక నల్ల బోర్డు మీద థోట్ ఫర్ టు డే అని రాసే బాధ్యత నాదే , అయితే ఇంకా చిన్న పిల్లనే కదా, నాకు అంత గొప్ప గొప్ప పదాలు , వాక్యాలు ఎక్కడ వచ్చు ? ,అందుకే మా ఇంటికి వచ్చే ఇండియన్ ఎక్ష్ ప్రెస్ , వార్త పత్రిక లో ఎడిటోరియల్ రాసే మధ్య పేజ్ లో రోజూ ఒక థాట్ ఫర్ టుడే , ఉండేది, నా పని ఆ విషయం ,ఒక నోట్ బుక్ లో రాసుకుని, అది తిరిగి ,ఆ బ్లాక్ బోర్ద్ మీద రాయడం, అది కూదా రంగు రంగుల చాక్ పీసు ల తో, క్లాస్ రూం లో బ్లాక్ బోర్డ్ మీద ఒక మూల ఆ రోజు డేట్ , వారం , రాయడం కూడా నా పనే .
హమ్ ... ఏమిటో ఈ అరవ చాకిరి , ఎవరు నన్ను చేయమని నాకు చెప్పిన గుర్తు లేదు, ఏమో చెప్పారేమో , కూడా గుర్తు లేదు , యువర్స్
ఒబీడియాన్ట్లీ అంటారు ,అలా ఉండే దాన్ని.
మేం ఎనిమిదో తరగతి లో ఉండగా మద్రాస్ , తిరుపతి, విహార యాత్ర కి వెళ్లాం, మహాబలిపురం ,జూ, మరో ముఖ్య మయిన పెరంబుర్ కోచ్ ఫాక్టరీ ,చూసాం . తిరుపతి కూడా వెళ్ళాం .
తిరిగి వచ్చి మా నిర్మల టీచర్ అడిగినట్టు మద్రాసు యాత్ర మీద పెద్ద వ్యాసం రాసి ,అసెంబ్లీ లో చదివేసిన రోజు మారు మోగిన చప్పట్లు , ఎంత మధురమైన జ్ఞాపకమో ...
పదో తరగతి , పరీక్షల కోసం కష్టపడి చదువుతూ ఉండగా , ప్రశ్నా పత్రాలు లీక్ అయాయి అంటే ,ముందే బయటకి వచ్చెసాయి. నాకు ఎంత ,కోపం ,చికాకు ఏడుపు వచ్చాయో . మనం కష్ట పడి , చదివి మంచి మార్కులు సంపాదించడం ఒక గొప్ప ఘనకార్యం కాని, ఇలా ప్రశ్నా పత్రం ముందు పెట్టుకుని చదవడం ఎంత బాధో ? స్కూల్ ఫస్ట్ వచ్చింది అన్న సంతోషం అంతా పోయింది ,ఈ ఘటన తో , ఎవరో ఒక మంత్రి కొడుకు కోసం మొత్తం పేపర్లు లీక్ అయాయని ,తెలిసి ఈ చదువు ,ఈ పరీక్షలు ఎంత అబద్ధమో అనిపించింది ..
టీ వి చానెల్స్ లో ,చూచి రాస్తున్నారు పదో తరగతి పిల్లలు అంటూ చూపించి నప్పుడు అదే గుర్తు వస్తుంది , ఏమీ కొంపలు మునగవు , ఈ విద్యార్ధులు , చూసి రాస్తే , మన చదువులు ఎంత విలువలు నేర్పిస్తున్నారో అర్ధం అయి, బాధ కలుగుతుంది , అయినా కొంత ఆలోచించి రాసే ప్రశ్నలు ఇచ్చి టెక్స్ట్ బుక్స్ చూసి రాసే విధానం ఉండాలి ,చదువు అంటే గుడ్డిగా జవాబులు బట్టి పట్టడం కాదు ఆలోచన, విచక్షణ , మెరుగు అయిన జ్ఞానమ్.. ఇది చదువు .. అంటే .. ఒక సర్టిఫికేట్ .. కాదు.
పరీక్ష లు నిజం గా ఎంత ఫార్సో ,అర్ధం అయాక , ఎప్పుడు ఎలా మొదలయిందో తెలియదు కాని ఈ పరీక్షలు ,ఈ వ్యవస్థ ఎంత వ్యర్ధమో ,ఎంత నిరర్ధకమో అని తోచింది
అయినా పదహారేళ్ళకి , వ్యవస్థ మీద విరుచుకు పడని వారు ఉన్నారు అంటే , వారిలో ఏదో లోపం ఉన్నట్టే , అమ్మ చెప్పే జాగ్రత్తలు , నాన్న అడిగే రాత్రి ఎన్ని గంటలకి వచ్చావు ? అనే ప్రశ్నలు విసుగు కోపం ఎందుకు తెప్పిస్తాయి అంటే అంతా , ఆ వయసు మహిమే .
ఎర్రెర్రని పుస్తకాలు, కార్ల్ మార్క్స్ పేరు, రష్యా లో విప్లవం ,గోర్కి అమ్మ పుస్తకం మావో చెప్పిన సాంస్కృతిక విప్లవమ్.. ఇవి మా మధ్య మాట్లాడుకునే విషయాలు అయిపొయాయి.
పార్టి ,అంటూ పనులున్నాయి అంటూ, ఎక్కడెక్కడికో వెళ్లి వస్తే , లేచి అన్నం వడ్డించే అమ్మ ఉన్న ఇల్లు మాది. అంటే వసంత కి తను ఏం చేస్తోందో తనకి తెలుసు ,అడిగితె విసుక్కుంటుంది , అంతే కాని జవాబు చెప్పదు ,అని వారి నమ్మకం మరి.
అలానే కాలేజ్ కి వచేసాం ఎంత విప్లవం, ఈ వ్యవస్థ మారాలి అంటూ స్లొగన్స్ చెప్పినా తీరా పరీక్షల సమయం కి గబ గబా చదివేసుకుని , ఫస్ట్ మార్కులు తెచ్చు కోవడం ఒక ఆనవాయితి అయిపొయిన్ది.
అంటే , నా చిన్నప్పటి నించి బాగా చదువుకోవాలి అని బుర్రలో నాటుకుపోయింది , అన్న మాట.. నేను చెప్పిన అశాస్త్రీయ విద్యా విధానం మారాలి , అనే మాట లు విని ,ఇద్దరు స్నేహితురాళ్ళు నిజం గా చదువు కి దూరం అయారు కాని ,నేను మటుకు ఎం ఎస్ సి వరకు చదివెసుకున్నాను.
చాల సిగ్గు పడ్డాను ఏమిటి ఇలా నేను ? చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని, కాని, నా మనసు చెప్పినట్టు చేయడం , నేను సిగ్గు పడకుండా చేయడం ... దానినే పిరికితనం అన్నా సరే , నాకు నేనయినా నిజాయితీ గా ఉండాలి కదా , చదువు అంటే ఉండే ప్రేమ , తపన.. చదువు మాననీయకుండా చేసింది .
మా బంగారం అని పిలుచుకునే స్నేహితురాలు , గోడ మీద అశాస్త్రీయ విద్యా విధానం మారాలి అనే స్లోగన్ చూసి, అదేంటి ? వసంతా మనం స్చైన్స్ చదువుతున్నాం కదా, వద్దు అంటారేమిటి ?? అనేసి ,నన్ను నిజం గా నవ్వించింది ,ఆ పూట .. మన స్లొగన్స్ అలాగే ఉంటాయి , అదేమీ భాషో కాని.
పూట పూట కి పార్టి, కార్య కలాపాలు అంటూనే ఎం ఎస్ సి వరకు చదివి, మా అమ్మ ,నాన్న గార్ల బెంగ తీర్చాను అదే ఏడాది పెళ్లి కి కూడా రెడి అయిపోయి, ఇంకా పూర్తిగా జన జీవన స్రవంతి లో కలిసి పోయాను అని చెప్పి, మా అమ్మ , చాల ఏళ్ళ తరవాత , కంటి నిండా నిద్ర పోయి ఉంటుంది ....
శారదా బాల విహార్ లో మంచి ప్రవర్తన కి చార్ట్ మీద వేసిన ఎర్రని గుర్తులు ఇప్పటికి నేను ఎన్ని సంపాదించుకుని ఉంటానో ? అని మనసులో ఇంకా లెక్కలు వేస్తూనే ఉన్నాను. .. బాల్యం ఎప్పటికి మనలని వీడదు , మనం ఏదో పెద్ద వారం అయిపొయామ్.. అని అంతా భ్రమ.. భ్రాంతి ..
ఇది ఇలా ఇప్పటికి కొన్ని జ్ఞాపకాలు.. సశేషం ..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి